Wednesday, March 11, 2009

మహాశివరాత్రి -సద్గురు సందేశము


శ్రీ శైవ మహాపీఠము:పీఠాధిపతి పూజ్యశ్రీ సద్గురు శివానంద మూర్తి గారు మహాశివరాత్రి సందర్భముగా ఇచ్చిన సందేశము : సామాన్యముగా హిందువులందరికీ కూడా మహాశివరాత్రి చాలా గొప్ప పర్వదినం . పండుగకు పర్వదినానికి తేడా ఏమిటంటే పండుగకు ఉత్సవాలు చేస్తున్నాము ,పర్వదినానికి ఉపాసనలు చేసుకుంటాము .కేవలం ఉపవాసం ఉండి ,శివ దీక్షలో ౨౪ గంటలు కూర్చుంటే అది ఆధ్యాత్మిక మార్గం .ఇది హిందువు లందరకు సమానము.